త్రుటిలో తప్పించుకున్న 42 మంది విద్యార్థులు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి 42 మంది విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. దండేలికి చెందిన విద్యార్థుల టూర్‌ బస్సు.. ప్రమాదానికి గురైన బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈక్రమంలో లారీ ఢీకొన్న బస్సును దాటుకొని సురక్షితంగా ముందుకెళ్లింది. చిత్రదుర్గలో గురువారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును కంటెయినర్‌ లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.