
హైదరాబాద్, నవంబర్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలతో చేసి సరస్వతి దేవి చిత్ర పటానికి, ఎస్ ఆర్ రంగనాథన్ చిత్ర పటానికి, జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎం.సుబ్బలక్ష్మి, ద్వితీయ శ్రేణి గ్రంథపాలకురాలు బి.ప్రతిభా రెడ్డి ఉద్యోగులు అవినాష్, వెంకటేశ్వర రెడ్డి, రామ్మోహన్ మహేందర్ అనిల్ రాజేష్, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వివిధ శాఖా గ్రంథాలయ ఉద్యోగులు, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png