రిజర్వేషన్లను అమలు చేయడానికి వెంటనే జీవో జారీ చేయాలి – రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, అద్దం న్యూస్ : అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచుతూ అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకం. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అని, రిజర్వేషన్లను అమలు చేయడానికి వెంటనే జీవో జారీ చేయాలి అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ విద్యానగర్లోని బిసి భవన్లో ఆదివారం...