ఘనంగా శ్రీ సాయి రామ్ హై స్కూల్లో 2000–2001 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హైదరాబాద్, అక్టోబర్ 12, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లో గల శ్రీ సాయి రామ్ హై స్కూల్లో 2000–2001 సంవత్సరం 10 తరగతి విద్యార్థులు రజతోత్సవ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ కపాల ప్రమీల, డైరెక్టర్ కపాల సిద్ధార్థ, ఉపాధ్యాయులు పవన్, సత్యనారాయణ, నాగరాణి, శ్రీధర్ ,శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు శాలువాలతో సత్కారం చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రతి విద్యార్థి తన స్కూల్ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ…. మా భవిష్యత్తుకు పునాది ఈ పాఠశాల నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో రాణించి, ఆ రంగానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అన్నారు. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ గురువులను కలసి వారి ఆశీర్వాదాలు పొందడం పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాణి గౌడ్, సంతోష్ కుమార్, టి.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, నిదీష్, గౌతమ్, సురేష్, ప్రనవానంద్, రవి శంకర్, జాన్సీ రాణి, అశ్విని షకీలా, సుచిత్ర, నిర్మల, సరిత, పుష్పాంజలి, స్వప్న, శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png