Addam News
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 12:59 pm Posted by : Addam News

న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యం

 

న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యం

హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యబైన ఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఎస్ఐ నాగ‌రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన ఇ.మాణిక్ రాయ్ ( 50 ) ఉపాధి కోసం వ‌చ్చిన‌ హైద‌రాబాద్‌లోని ఆజామాబాద్‌లో ఓ స్వీట్ షాపు గోడౌన్‌లో ప‌ని చేస్తున్నాడు. బీడి తెచ్చుకునేందుకు బ‌య‌ట‌కు వెళ్లిన మాణిక్‌రాయ్ మ‌ళ్లి తిరిగి గోడౌన్‌కు రాలేదు. ఎంత వెతికినా ఆయ‌న ఆచూకి తెలియ‌క‌పోవ‌డంతో అదో స్వీట్ షాపు గోడౌన్‌లో ప‌ని చేసే బ‌న్షి మాలిక్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన వ్య‌క్తిని ఎవ‌రైనా గుర్తిస్తే చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో నేరుగా వ‌చ్చి సంప్రదించాల‌ని, లేదా 87126 60162 ఫోన్ నంబ‌ర్ స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png