కొత్త జిల్లాలకు, ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులు సృష్టించి కొత్త నోటిఫికేషన్లు వేయాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య
హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : కొత్త జిల్లాలకు, ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులు సృష్టించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జేఏసి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా జరిగింది. నిరుద్యోగ జేఏసి అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, తెలంగాణ ఉద్యమకారులు విఠల్, పృధ్వి, హరికృష్ణ,...