గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు హైద‌రాబాద్ బ్యూరో, జూలై 16, ( అద్దం న్యూస్ ) :  హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్స‌వాలు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైద‌రాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ లు పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రుల‌కు అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు అమ్మవారికి పట్టువస్త్రాలు...