ప్రముఖ రచయిత్రి కెహెచ్ఎస్.జగదాంబ రచించిన శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి పుస్తకావిష్కరణ
ప్రముఖ రచయిత్రి కెహెచ్ఎస్.జగదాంబ రచించిన శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి పుస్తకావిష్కరణ హైదరాబాద్, జులై 29, అద్దం న్యూస్ : శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి సంఘమిత్ర కెహెచ్ఎస్.జగదాంబ రచించిన శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి సహస్రాధికం ( పద్య రూపం ) పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ విద్యానగర్ రాంనగర్ గుండు వద్ద జరిగింది. శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విశిష్ట మహిళ పురస్కార గ్రహీత ( తెలంగాణ ) పాఠ్యపుస్తక రచయిత్రి...