Addam News
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 6:19 am Posted by : Addam News

రేపటి నుంచి అంగన్‌వాడి టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

రేపటి నుంచి అంగన్‌వాడి టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 22, ( అద్దం న్యూస్ ) :   నాంపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీగా ఉన్న 38 అంగ‌న్‌వాడి టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సోమవారం నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నాంప‌ల్లి ప్రాజెక్ట్‌ సీపీడీవో కృష్ణచైతన్య తెలిపారు. న‌గ‌రంలోని 38 అంగ‌న్‌వాడి కేంద్రాల టీచ‌ర్ పోస్టుల ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు మలక్‌పేట అజంపుర‌ సలీంనగర్ కాలనీలో గల నాంపల్లి ప్రాజెక్ట్ సీడీపీవో కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. అంగ‌న్‌వాడి టీచర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జిరాక్స్ సెట్లపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 90141 76655, 99490 99471 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png