అండర్ –14 క్రికెట్ టోర్నమెంట్ విజేత ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ – విజేత టీమ్కు బహుమతిని అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నివి చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో రెండు రోజుల పాటు జరిగిన గాంధీనగర్ అండర్ –14 క్రికెట్ టోర్నమెంట్లో ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ విజేతగా నిలిచింది. గత రెండు రోజులపాటు శ్రీనివాస గ్రౌండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో 16 టీంలు పాల్గొనగా, శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఐకాన్ స్టార్స్, ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ ఫైనల్...