Addam News
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 1:21 pm Posted by : Addam News

లాభాలు వ‌చ్చే వ్యాపారాల‌ను ఎంచుకుని ఆర్థికంగా ఎద‌గాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు

లాభాలు వ‌చ్చే వ్యాపారాల‌ను ఎంచుకుని ఆర్థికంగా ఎద‌గాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్  లాభాలు వ‌చ్చే వ్యాపారాల‌ను ఎంచుకుని ఆర్థికంగా ఎద‌గాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లిలో దాసరి రవి ప్రసాద్, ప్రసన్న జెసి లు నూత‌నంగా ఏర్పాటు చేసిన సెరెన్ కేఫ్‌ను సోమ‌వారం రాత్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ… మార్కెట్‌లో లాభాలు వ‌చ్చే వ్యాపారాల‌ను ఎంచుకోవాల‌న్నారు. ఫుడ్‌, టీ లాంటి వ్యాపారాల‌కు నిత్యం మంచి గిరాకి ఉంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, ఆర్‌.వివేక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png