నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులను హరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

hcu university హైదరాబాద్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌రిస్తోంద‌ని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ శక్తులకు భూములను అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సియు భూములను అమ్మేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్‌, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం...