Addam News
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 9:42 pm Posted by : Addam News

ఓటు హక్కు వినియోగించుకున్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ :  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో బుధవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారత దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా, పేద‌ ముస్లిం ప్రజల అభ్యున్నతికి అడ్డుకట్ట వేసి, ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ “సభ్ కా సాత్… సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” నినాదంతో వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదించార‌న్నారు. దీని పై మత విధ్వేష‌పు విషాన్ని చిమ్ముత్తున్న ఎంఐఎం పార్టీని ఓడించి, రజాకర్ పార్టీకి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెబుతామ‌న్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png