పూడికతీత పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, అద్దం న్యూస్ : అకాల వర్షాల వల్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఫిర్యాదు మేరకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వరదనీటి సమస్య వివరాలపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కచ్చా మోరి పైప్లైన్లల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త చెదారాన్ని తొలగించేందుకు సూచించారు. ఈ నేపధ్యంలో డివిజన్లోని మోర్ సూపర్ మార్కెట్ వీధిలో, కెనరా బ్యాంక్ పార్క్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో...