Addam News
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 12:30 pm Posted by : Addam News

జాతియ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

జాతియ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కార్పొరేటర్ కార్యాలయం, జవహర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చిక్కడపల్లి, బాపూనగర్, బిఎస్ఎన్ఎల్ కాలనీ, అశోక్‌న‌గ‌ర్‌, టిఆర్‌టి, ఎస్ఆర్‌టి, అరుంధతి నగర్, సబర్మతి నగర్, గోల్కొండ క్రాస్ రోడ్స్, జనప్రియ సర్కిల్, పలు అపార్ట్‌మెంట్ బస్తీలు, కాలనీలలో జ‌రిగిన వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని హాజ‌రై జాతీయ జెండాల‌ను ఆవిష్క‌రించారు. ఈ వేడుకల్లో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్ రావు, డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, పాల శ్రీనివాస్, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, మహమూద్, మధన్ మోహన్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్, భారత్, సాయి కుమార్, నర్సింహ, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయిగౌడ్, యాదగిరి, సంపత్ యాదవ్, నీరజ్, ప్రశాంత్, శశికాంత్, సత్యేంధర్, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనూష, సుహాసిని, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png