మహిళా స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివి గిరినగర్ బస్తీ కమ్యూనిటీహాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హాజరై స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ పొందుతున్న మహిళలతో కార్పొరేటర్ పావని మాట్లాడారు. శిక్షణ తరగతుల పై టీచర్ల బోధన...