Addam News
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 8:00 pm Posted by : Addam News

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో రంజాన్ పండుగ ఘ‌నంగా జ‌రిగింది. వాల్మీకినగర్ బ‌స్తీలో బీజేపీ మైనారిటీ మోర్చ సీనియర్ నాయకుడు మొహమ్మద్ మహబూబ్, సబర్మతినగర్ బ‌స్తీలో బీజేపీ నేతలు రహమాత్ అలి, యాసిన్ వారి కుటుంబ సభ్యులను కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ బీజేపీ నాయ‌కుల‌తో కలిసి ఎస్ఆర్‌టి నివాసి మ‌హ్మ‌ద్ ఖ‌మ‌ర్‌ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, శ్రీకాంత్, రాజు, ఉమేష్, సత్తి రెడ్డి, సురేష్, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ, భరత, సాయి కుమార్, ఆనంద్ రావు, డి కుమార్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png