తెలంగాణలో కోవిడ్ కేసు నమోదు –  కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు పాజిటివ్

వెబ్ డెస్క్‌, అద్దం న్యూస్ :   తెలంగాణలో కోవిడ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక డాక్టర్ కు కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైద‌రాబాద్‌లోని ఓ డాక్ట‌ర్‌కు క‌రోనా సోక‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.