డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి – ఎంటమాలజి ఏఈ వనజ

  డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి ♦ ఎంటమాలజి ఏఈ వనజ మ‌ల్కాజిగిరి, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :   డెంగ్యూ, మలేరియాను నియంత్రించాల‌ని ఎంటమాలజి ఏఈ వనజ అన్నారు. మలేరియా దినోత్సవం సందర్భంగా మ‌ల్కాజిగిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో శుక్ర‌వారం స‌ఫిల్‌గూడ‌ నుంచి ఆనంద్‌బాగ్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ వ‌న‌జ మాట్లాడుతూ.. దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు....