కళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీ

హైదరాబాద్, జూన్ 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ రెవెన్యూ మండలం ప‌రిధిలో మంజూరైన క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. క‌వాడిగూడ డివిజ‌న్ లోయ‌క్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ల‌బ్దిదారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కులను అంద‌చేశారు. ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్‌సింగ్...