Addam News
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 5:29 am Posted by : Addam News

జవహర్‌న‌గ‌ర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌కు గురువారం నోట్ పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.ల‌క్ష్మ‌ణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందచేసారు. ఈ సంద‌ర్భంగా కోవ రాహుల్ తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌నికేక్ క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్య‌క్షుడు భరత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయ‌కులు రమేష్ రామ్, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి.రాజు, ఎం.ఉమేష్, పాల శ్రీను, మహమూద్, శివ కుమార్, బాలకృష్ణ, సురేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, భారత్, సత్యేంధర్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, సంయుక్తా రాణి, పూర్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాస్, టీచర్లు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png