సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాల నిజమైన విజేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అద్దం న్యూస్ : సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాల నిజమైన విజేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద, అరుంధతినగర్, నేతాజినగర్, ఎల్ఐసి బ్రిడ్జి వద్ద తదితర ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె...