దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. పోలీసుల దాడులు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ది పెండెంట్‌ ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్త్‌డే వేడుక చేసినట్లు గుర్తించారు. ఇందులో దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas), మాధురి (Madhuri) పాల్గొన్నారు. బర్త్‌డే పార్టీకి 29 మంది వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పార్టీలో 7 మద్యం బాటిళ్లు, హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి పూర్తి...