ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో నిలిపేందుకు కృషి – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో నిలిపేందుకు కృషి – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 14, అద్దం న్యూస్ : నిరుపేదలకు ఉచితంగా మంచి వైద్యాన్ని అందించేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బౌద్ధానగర్ ఎస్ఆర్వి మల్టీ స్పెషాలిటి క్లినిక్ లో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించి, ఉచితంగా మందులను రోగులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్...