అవినీతి బాగోతాన్ని పత్రికలు బయట పెడుతున్నాయనే అక్కస్సుతో పత్రికలపై ఆక్రోషం వ్యక్తం చేయడం ఎమ్మెల్సి కవిత మానసిక స్థితికి దర్పణం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్నటిదాకా సంస్థను నడిపి, తన అవినీతి బాగోతాన్ని పత్రికలు బయట పెడుతున్నాయనే అక్కస్సుతో పత్రికలపై ఆక్రోషం వ్యక్తం చేయడం ఆమె మానసిక స్థితికి దర్పణం టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. హైదరాబాద్ టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ మహిళా సమాజానికి మచ్చ తెచ్చే విధంగా కాసుల కోసం అవినీతి డబ్బుల...