సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జె.నర్సయ్య కు సన్మానం
హైదరాబాద్, ఆగస్టు 17, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జె.నర్సయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన జి.సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అదనపు డిసిపి జె.నర్సయ్యకు సోమవారం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా నర్సయ్యకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందచేసి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైనందుకు శుభాకాంక్షలను తెలియచేశారు. అదనపు డిసిపి నర్సయ్యను సన్మానించిన వారిలో ప్రవీణ్ కుమార్, వాసు, సమర్, శివ తదితరులున్నారు.![]()

![]()













Leave a Reply