Addam News
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 10:43 am Posted by : Addam News

కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలోని శివమ్‌ టెక్నాలజీస్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడి కోచింగ్‌ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు.

దర్యాప్తు కొనసాగుతోంది..

ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా బ్యాటరీల నిర్వహణ లోపం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png