Addam News
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 12:09 pm Posted by : Addam News

క‌వాడిగూడ‌లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం రేపు

క‌వాడిగూడ‌లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం రేపు

హైదరాబాద్, ఆగ‌స్టు 01, అద్దం న్యూస్ :   దోమ‌ల‌గూడ సాయివాణి ఆసుప‌త్రి వ‌ద్ద 450 ఎంఎం వాట‌ర్ స‌ప్లై పైప్‌లైన్ లీకేజి మ‌ర‌మ్మ‌తుల వ‌ల్ల ఆదివారం ( రేపు ) క‌వాడిగూడ‌లోని ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌ని దోమ‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం కార్తీక్‌రెడ్డి తెలిపారు. పైప్‌లైన్ లీకేజి మ‌ర‌మ్మ‌తుల వ‌ల్ల అశోక్‌న‌గ‌ర్‌లోని కొన్ని ప్రాంతాల‌తో పాటు క‌వాడిగూడ‌లోని పూల్‌బాగ్‌, భీమా మైదాన్‌, అర‌వింద్‌న‌గ‌ర్, దేవీ ప్ర‌సాద్ బాగ్‌, అవుట్‌పోస్ట్ ఏరియా, బండ మైస‌మ్మ‌, ఎల్ఐసి కాల‌నీ, మారుతీన‌గ‌ర్‌, మోతిలాల్‌ నెహ్రున‌గ‌ర్‌, ఎల్చిగూడ, జ‌ల‌వాయు ట‌వ‌ర్స్‌, గాంధీన‌గ‌ర్‌లోని స‌బ‌ర్మ‌తిన‌గ‌ర్‌, వివి.గిరిన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png