Addam News
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:48 am Posted by : Addam News

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు తరలిన బిజెపి శ్రేణులు

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు
తరలిన గాంధీనగర్ డివిజన్ బిజెపి శ్రేణులు

హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) :    సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జ‌రిగిన ప్ర‌ధాన మంత్రి, బిజెపి బ‌హిరంగ స‌భ‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నుంచి బిజెపి శ్రేణులు భారీ ఎత్తున త‌ర‌లివెళ్లారు. స‌భ‌కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బ‌స్సుల‌ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 600 వందల మందితో బయలుదేరి డివిజన్ బిజెపి శ్రేణులు బహిరంగ సభలో పాల్గొన్నార‌ని మాజీ కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజేపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, వాణి శాస్త్రి, ప్రకాష్ యాదవ్, శివ కుమార్, శ్రీనివాస్, నర్సింహ, హన్మంతు, యాదగిరి, రాజేందర్, నీరజ్, సంయుక్త రాణి, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png