Addam News
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 10:04 pm Posted by : Addam News

అర్హులందరికీ రేషన్ కార్డుల మంజురుకు చ‌ర్య‌లు – సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్‌

అర్హులందరికీ రేషన్ కార్డుల మంజురుకు చ‌ర్య‌లు

– సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్‌


సికింద్రాబాద్‌, జులై 30, అద్దం న్యూస్ :    సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ తొమ్మిదోవ‌ రేషన్ సర్కిల్ పౌర సరఫరాల అధికారి చాముండేశ్వరి నేతృత్వంలోని పౌర సరఫరాల అధికారుల బృందం బుధవారం సితాఫలమండీలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ పౌర సరఫరాల విభాగం కార్యకలాపాలను సమీక్షించారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా ప‌ద్మారావుగౌడ్ ఆదేశించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png