ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి – ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ జాయింట్ కమిషనర్ ఎస్వై.ఖురేషి కి మెమొరాండం
హైదరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు సోమవారం ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ జాయింట్ కమిషనర్ ఎస్వై.ఖురేషి ని కలిసి...