సుందరయ్య పార్క్‌లో పచ్చదనాన్ని కాపాడాలి – హెచ్‌సిఎఫ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     గతంలో ఉన్నచోటే పిల్లల ఆట వస్తువుల నిర్మాణాన్ని కొనసాగించాలని పార్కులో పచ్చదనాన్ని కాపాడాలని హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం (హెచ్‌సిఎఫ్ ) అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షుడు భవాని శంకర్, సహాయ కార్యదర్శులు రమేష్, శంకరయ్య తదితరులు సోమ‌వారం ప్రజావాణిలో జిహెచ్‌ఎంసి కమీషనర్ ఆర్‌వి.కర్ణన్ ను కలిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ... సుందరయ్య పార్క్‌లో వారం రోజుల నుండి పచ్చదనానిచ్చే గ్రీనరీని తొలగించి, పిల్లల ఆట వస్తువులు నిర్మించేందుకు...