హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు గుండు జగదీష్ బాబు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జగదీష్ బాబు రెండవ సారి నియామకమయ్యారు. ఈ మేరకు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ చేతుల మీదుగా నియామకపత్రాన్ని జగదీష్ బాబుకు అందచేశారు. ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ… టిపిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ దార్శనిక నాయకత్వం, స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో ఈ విశిష్ట నియామకం జరిగిందన్నారు. టిపిసిసి విశిష్ట నాయకత్వం తెలివి తేటలు, తిరుగులేని నిబద్ధతతో మార్గనిర్దేశం చేయబడుతోందన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభ ఎంపి రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిల సామూహిక దృక్పథం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు స్థాయి కార్యకర్తల సాధికారత, సంస్థాగత బలాన్ని పునరుజ్జీవింపజేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గుండు జగదీష్ బాబు మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా రెండవసారి నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకుగాను మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్, అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, దీపక్ జాన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా బాధ్యతలను అత్యంత అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో నిర్వర్తిస్తూ, సంస్థను, అది నిలబెట్టుకునే ఆదర్శాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png