Addam News
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 11:30 am Posted by : Addam News

ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో హై అలెర్ట్

 

తిరుమ‌ల‌, అద్దం న్యూస్ :   జమ్మూకాశ్మీర్ ప‌హ‌ల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ సైతం భద్రత సిబ్బందిని అలెర్ట్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png