ఎమ్మెల్యే ముఠా గోపాల్ను పరామర్శించిన కెటిఆర్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కెటిఆర్ కోరారు. కెటిఆర్తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నాయకులు కొప్పుల ఈశ్వర్, ముఠా జైసింహా తదితరులున్నారు.