శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం వద్ద నూతన షెడ్డు ప్రారంభోత్సవం
శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం వద్ద నూతన షెడ్డు ప్రారంభోత్సవం ముషీరాబాద్, ఫిబ్రవరి 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం ఆర్టిసి క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ.8 లక్షలతో నూతనంగా నిర్మించిన షెడ్డును ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్...