Addam News
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:42 am Posted by : Addam News

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో
స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎల్.అలివేలు, నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎం.సుబ్బలక్ష్మి, నగర గ్రంథాలయ సంస్థ ద్వితీయ శ్రేణి గ్రంథపాలకుడు బి.మహేందర్, నగర గ్రంథాలయ సంస్థ ద్వితీయ శ్రేణి గ్రంథపాలకుడు జివి.ఎస్ రాజు, హైద్రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యాలయ ఉద్యోగులు వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్ యాదవ్, రామ్మోహన్, నగర గ్రంథాలయ సంస్థ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png