పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : రాబోయే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టి రామారావు 102 వ జయంతి సందర్భంగా ఈ నెల 28 వ తేదీన జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. బుధవారం దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ఇప్పటికిప్పటికి ఎన్నికలను నిర్వహిస్తే, రేపే మీ పరిస్థితి బట్టబయలవుతుందనే భయంతో...