కరాటేతో ఆత్మ‌స్థైర్యం పెరుగుతుంది – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ :   కరాటేతో ఆత్మ‌స్థైర్యం పెరుగుతుందని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గోల్డెన్ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వ‌ర్యంలో ఫ్లయింగ్ కిక్ శిక్షణలో ప్రావీణ్యం చెందిన విద్యార్థులకు "కిడ్ హుడ్ ఇంటర్నేషనల్ స్కూల్" లో కరాటే శిక్షణలో గ్రేడ్‌ను సంపాదించిన విద్యార్థులకు గ్రేడింగ్ బెల్ట్‌ల‌ను, ప్రశంసా ధృవీకరణ పత్రాలను ( సర్టిఫికెట్లు) బహుకర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కిడ్స్ స్కూల్ ఛైర్మ‌న్‌ మనోజ్ కొఠారి, కరాటే అకాడమీ ఫౌండర్ విక్కీ...