Addam News
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 1:15 pm Posted by : Addam News

బిఆర్ఎస్ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో కెటిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

బిఆర్ఎస్ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో కెటిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

హైద‌రాబాద్‌, జూలై 24, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. శుక్ర‌వారం క‌వాడిగూడ డివిజ‌న్ మైస‌మ్మ‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్లో క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో బిఎల్ఓ లకు, అంగ‌న్‌వాడి టీచ‌ర్ల‌కు, ఆశా వ‌ర్క‌ర్ల‌కు చీర‌ల‌ను పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై క‌ల్వ‌గోపితో క‌లిసి చీర‌ల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు జైసింహా, బ‌ల్లెక‌రి రాములు, బల్లెకరి రమేష్, బండ జుగేందర్, సామల శ్రీనివాస్, కావలి సుధాకర్, మధు, అభి, శివ, సంతోష్, రమణ, మురళి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png