తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా న్యాయ‌వాదుల‌ ర్యాలీ

హైదరాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ :  తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా సిటీ సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వ‌ర‌కు అడ్వ‌కేట్లు జాతీయ జెండాల‌తో ర్యాలీని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌త్‌రాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సి రామ‌చంద్ర‌రావు, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌వీన్ కుమార్‌, కార్య‌ద‌ర్శి అజ‌య్‌, టి జాక్ మాజీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు మ‌ణిక్ ప్ర‌భు, తిరుమ‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.