హైదరాబాద్ క్రైమ్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్శిగుట్టకు చెందిన మనోజ్ ( 29 ) ఓ ప్రైవేట్ ఆసుపత్రి డయాగ్నస్టిక్లో పని చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం 7ః30 గంటల సమయంలో విద్యానగర్ నాగమయ్యకుంట వైపు నుంచి తన బైక్ తో స్టీల్ బ్రిడ్జి పై వెళ్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా రాగానే బైక్ ఆపి దూకాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png