Addam News
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 3:14 am Posted by : Addam News

తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా మనోజ్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా మనోజ్ గౌడ్

హైద‌రాబాద్‌, మే 27, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ  ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా పరకాల మనోజ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామ‌కాన్ని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ… జాగృతి నుంచి నేటి వ‌ర‌కు క‌విత వెంబ‌డే ఉంటూ… సేవ‌లందిస్తున్నాన‌న్నారు. జాగృతికి, పార్టీకి చేసిన సేవ‌ల‌ను గుర్తించి త‌న‌కు పార్టీలో కీలక పదవి, బాధ్యతలను ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ వ్యవస్థాపకులు, మా ఆత్మీ కల్వకుంట్ల కవితక్కకు ధన్యవాదాలు తెలిపారు. నాకు అనుక్షణం సరైన మార్గాన్ని చూపిస్తూ, విలువైన సలహాలు అందిస్తూ, నా రాజకీయ జీవితానికి మార్గదర్శకులుగా నిలిచిన నవీన్ చారి కి, పూర్ణచంద్ర రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని మనోజ్ గౌడ్ పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png