చార్మినార్ పరిసరాల్లో వైభవంగా మిలాద్ ఉన్ నబీ
చార్మినార్ పరిసరాల్లో వైభవంగా మిలాద్ ఉన్ నబీ చార్మినార్, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో నిర్వహించిన ఊరేగింపు వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగర పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఉన్నతాధికారులతో కలిసి చార్మినార్ వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు. ఊరేగింపు చార్మినార్ వద్దకు చేరుకోగానే ఆయన ముస్లిం మత పెద్దలను ఆత్మీయంగా...