జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గోపాల్
హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ వర్థంతి కార్యక్రమం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో జరిగింది. ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న జయశంకర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా, గాంధీనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాకేష్, పోతుల శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు...