Addam News
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 3:27 pm Posted by : Addam News

సొంత పార్టీపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వెబ్ డెస్క్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ :    సొంత పార్టీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన నన్ను, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, నాతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ నన్ను పక్కన పెట్టారని అన్నారు. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ పార్టీ నన్ను మోసం చేసిందని అన్నారు. నాకు మంత్రి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png