Addam News
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 3:48 am Posted by : Addam News

వినాయ‌కుడికి పూజ‌లు చేసిన ఎన్‌జీవో, టిజివో నాయ‌కులు

హిమాయ‌త్‌న‌గ‌ర్, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితి న‌వ‌రాత్రుల్లో భాగంగా హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహానికి తెలంగాణ ఎన్‌జివో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్ లు శ‌నివారం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. యావత్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలంద‌రూ సుఖ సంతోషాలతో ఉండాలని వినాయ‌కుడిని కోరారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ… అతి త్వరలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లు, పిఆర్‌సి అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png