Addam News
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 7:32 am Posted by : Addam News

Japan: అక్కడ మూడో తరగతి వరకు ‘నో ఎగ్జామ్స్’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జపాన్‌ (Japan) దేశంలో విద్యా వ్యవస్థకు ప్రత్యేకమైన లక్షణం ఉంది. అక్కడ మూడో తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు, హోంవర్క్‌ (No exams)లు లేదా ర్యాంకులు ఉండవు. ఈ మొదటి మూడేళ్లను వారు విద్యా పునాది కాకుండా మనుష్యత్వం, క్రమశిక్షణ, మరియు సామాజిక విలువలను నేర్చుకునే కాలంగా భావిస్తారు. చిన్న పిల్లల్లో సహకారం, సమయపాలన, మంచి అలవాట్లు, మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం.

పిల్లలు తమ స్కూల్‌ బ్యాగ్‌ ను తామే సర్దుకుంటారు, క్లాస్‌రూమ్‌ ని శుభ్రం చేయడం, సహచరులకు సహాయం చేయడం లాంటి దైనందిన పనులను నేర్చుకుంటారు. దీనివల్ల వారు స్వయంక్రమశిక్షణను, సమాజం పట్ల గౌరవాన్ని అలవడించుకుంటారు. ఇంకా భారతదేశంలాంటి దేశాల్లో నర్సరీ నుంచే హోంవర్క్‌లు, పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడితో చిన్నారులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనివల్ల సృజనాత్మకత, విలువల పెంపకం కొంతవరకు దెబ్బతింటుంది. జపాన్‌ నమూనాలోని ఈ విలువాధారిత విద్యా విధానం మన దేశానికీ ప్రేరణ కావచ్చు. విద్య అంటే కేవలం మార్కులు మాత్రమే కాదని, మంచి మనిషిగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ఈ విధానం స్పష్టంగా తెలియజేసుతుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png