సామాన్యుడిని దోచుకునే లక్ష్యం ఉంటే ఏ ప్రభుత్వానికి మనగడ ఉండదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ
హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ : ఎంతసేపు సామాన్యుడిని దోచుకోవాలనేదే లక్ష్యంగా పెట్టుకుంటే ఏపార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వం మనగడ కొనసాగించలేదని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ.... దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడు హలో లక్ష్మణా ! అంటూ అర్థాకలితో జీవనం సాగిస్తున్న సమయంలో వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం 50...