ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ల‌క్ష్యం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందించడానికి అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌నకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ( ఐసిసిసి ) లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో...